ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల...ఆటాడుకుందాం రా!...ఈ నెల 24 నుంచి
అమరావతి:తాజా రాజకీయ పరిణామాలతో బుర్ర వేడెక్కిపోయివున్న ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు అవకాశం కల్పించాలని శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయించారు. అందుకే ఈ ప్రజా ప్రతినిధులందరికి క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 24 నుంచి 27 వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యులకు క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన మంగళవారం ఆయన ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ నెల 24 నుంచి 26 వరకు ఆటల పోటీలు నిర్వహిస్తారు.

మొత్తం 10 రకాల ఆటల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అనంతరం 27న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు సంబంధించి జరిగిన ప్రత్యేక సమావేశంలో మండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, అయ్యన్న, కొల్లు రవీంద్ర, చీఫ్విప్ రఘునాథరెడ్డి, విప్ కూన రవికుమార్, ఇన్ చార్జ్ సెక్రటరీ విజయరాజు తదిదరులు పాల్గొన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications