ఏపీలో 7.50 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, మహారాష్ట్ర తర్వాత సెకండ్ ప్లేస్..
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఒకరోజులో కూడా భారీగానే కేసులు వస్తున్నాయి. అయితే దేశంలో వైరస్ కేసుల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. తర్వాత ఏపీ నిలిచింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు 10 లక్షల 51 వేలకు చేరుకొన్నాయి. వైరస్ కేసులు పెరుగుతున్న.. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.
ఏపీలో 7.50 లక్షలకు పాజిటివ్ కేసులు చేరాయి. దేశంలో రెండోస్థానంలో కేసులు ఇక్కడే ఉన్నాయి. ఇందులో 6.91 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 6 159 మంది వైరస్ బారినపడి చనిపోయారు. ఆ తర్వాత కరోనా వైరస్లో కర్ణాటక 6.90 లక్షలు, తమిళనాడు 6.50 లక్షలతో మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. యూపీ 4.31 లక్షలతో ఐదో స్థానంలో ఉంది.
ఇటు గత 24 గంటల్లో ఏపీలో 73 వేల 625 మందికి పరీక్షలు చేశారు. 5 వేల 653 మందికి పాజిటివ్ చేసింది. దీంతో వైరస్ కేసులు 7 లక్షల 50 వేల 517కి చేరింది. గత 24 గంటల్లో 6 వేల 659 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం 6 లక్షల 97 వేల 699 మంది కోలుకున్నారు. 46 వేల 624 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ 35 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6 వేల 194 మంది చనిపోయారు.
ప్రకాశం జిల్లాలో ఆరుగురు చనిపోగా.. చిత్తూరులో ఐదుగురు చనిపోయారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చనిపోయారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు.. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు.