Weather: ఏపీలో మండిపోతున్న ఎండలు, కర్నూలులో అత్యధికంగా 43 డిగ్రీలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోతుంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వరకు వడగాలులు వీస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం బయటికి రావాలంటే జనం జంకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న వేడి గాలుల కారణంగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి.

రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని అనేక చోట్ల 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. కోయిలకుంట్లలో 42.6 డిగ్రీలు, గురజాలలో 41.85, అనంతపురంలో 41.6, చిత్తూరులో 41.55, జమ్మలమడుగులో 41.4, కనిగిరిలో 41.2, తిరుపతిలో 40.2, విజయవాడలో 39.2, విశాఖపట్నంలో 33.9, ఒంగోలులో 36.8, గుంటూరులో 37.4, నెల్లూరులో 39.7, కాకినాడలో 34, విజయనగరంలో 36.9, ఏలూరులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది ఇలావుండగా, తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. పదేళ్ల రికార్డు బద్దలైంది. ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications