ప్రయాణీకులకు APSRTC గుడ్ న్యూస్, ఇక నుంచి కొత్తగా..!!
APSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల సౌలభ్యం మేరకు కొత్త నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. రెవిన్యూ డివిజన్లు.. మండలాల్లో మార్పులను ఖరారు చేయటంతో.. ఇప్పుడు ఆర్టీసీ సైతం ప్రయాణీకుల కోసం మరో నిర్ణయం వెల్లడించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త ఆదేశాలు వెంటనే అమల్లోకి రానున్నాయి.
ఏపీ ప్రభుత్వం జిల్లాలు.. మండలాల పునర్విభజన చేయటంతో ఆర్టీసీ కూడా డిపోలను కూడా జిల్లాల వారీగా విభజించింది. ఈ మేరకు సంస్థ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలవరం జిల్లాల్లో ఒక్క డిపో కూడా లేదు. ఇక మార్కాపురం జిల్లా పరిధిలో కనిగిరి, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు డిపోలు వచ్చాయి. మార్పులు, చేర్పులు అన్నీ నిన్నటి (బుధవారం) నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంతకాలం రంపచోడవరం బస్స్టాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడిన పోలవరం జిల్లా పరిధిలోకి రానుంది. తాజాగా జరిగిన మార్పులు, చేర్పులతో రాష్ట్రంలో ఒక్క డిపో కూడా లేని జిల్లాగా పోలవరం నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు డిపో ఒక్కటే ఉంది. విజయనగరం జిల్లాలో రెండేసి డిపోల చొప్పున విజయనగరం, ఎస్.కోట, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం డిపోలు ఉన్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో ఏకంగా 10 డిపోలు ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 7 డిపోలు చొప్పున ఉన్నాయి.

బాపట్ల జిల్లాలో బాపట్ల, రేపల్లె, చీరాల డిపోలు ఉండనున్నాయి. అదే విధంగా ప్రకాశం లో ఒంగోలు, అద్దంకి, కందుకూరు ఉంటాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు కొనసాగనున్నాయి. నెల్లూరు జిల్లాలోనెల్లూరు-1, 2, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, రాపూరు, గూడూరు ఉంటాయి. తిరుపతి జిల్లాలోవాకాడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, మంగళం, అలిపిరి, తిరుమల, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు డిపోలు ఉండనున్నాయి. కాగా, చిత్తూరు జిల్లాలోచిత్తూరు-1, 2, పలమనేరు, కుప్పం కొనసాగుతాయి. అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లె-1, 2, రాయచోటి, పుంగనూరు ఖరారు చేసారు. వైఎస్సార్ కడప జిల్లాలో కడప, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న జిల్లాల నుంచి వేరొక జిల్లా పరిధిలోకి మారాయి. రాష్ట్రంలో జిల్లాల తాజా మార్పులు, చేర్పులు కారణంగా 9 డిపోలు మారాయి.
-
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - ముహూర్తం ఫిక్స్..!! -
పీఎస్సార్, కాంతిరాణా టాటాపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం- ఉత్తర్వులు..!! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్! -
ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! -
ఏపీ ప్రజలకు ఉగాది కానుక.. వారికి ఏకంగా లక్ష ఇళ్ళు! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..!












Click it and Unblock the Notifications