Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్టీసీ ముందుస్తు రిజర్వేషన్: ప్రయాణికులకు లాభం కంటే నష్టమే ఎక్కువే

విజయవాడ: టిక్కెట్ల రిజర్వేషన్‌లో ఏపీయస్ఆర్టీసీ కొత్త విధానానికి తెరదీయనుంది. ఈ కొత్త విధానం వల్ల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారు లాభపడనున్నారు. ప్రయాణ సమయానికి కనీసం వారంరోజులు, అంతకంటే ముందుగా టికెట్‌ తీసుకుంటే బస్‌ ఛార్జీ 5 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

ఆలస్యం చేస్తే మాత్రం మీ జేబుకి చిల్లు పడనుంది. ఈ మేరకు బస్ ఛార్జీల విషయంలో కొత్తగా మార్పులు చేయనున్నారు. అంతేకాదు ఫిక్స్‌డ్ ఛార్జీల విధానానికి స్వస్తి చెప్పనున్నారు. ఇకపై రద్దీగా ఉండే రోజుల్లో ఛార్జీలు పెంచడం, రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో (డైనమిక్‌ ఫేర్‌) తగ్గించాలంటూ ఆర్టీసీ నిర్ణయించింది.

APSRTC offers 5-20 percent reduction in the advance reservation

అయితే ఇక్కడ ఓ కండిషన్ ఉంది. ఆన్ లైన్ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల్లోనే ఈ కొత్త విధానాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపజేయనున్నారు. ప్రయాణికుడి ప్రయాణ తేదీ, టికెట్ బుకింగ్ చేసే తేదీని బట్టి ఛార్జీలు ఎంతమేరకు నిర్ణయించాలన్న దానిపై ఏపీయస్ఆర్టీసీ ఇప్పటికే ఓ సాప్ట్‌వేర్‌ను రూపొందించింది.

ప్రయాణ సమయం ఆరు రోజుల ముందు నుంచీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. బస్సులో సీట్లు అయిపోయేకొద్ది, ప్రయాణ సమయం దగ్గరపడుతున్నకొద్ది సాధారణ ఛార్జీల కంటే కనీసం 5 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. బస్సుల్లో రద్దీ లేకుంటే, సీట్లు ఖాళీగా ఉంటే సాధారణ ఛార్జీలే ఉంటాయి.

ప్రతిరోజూ 603 సర్వీసులకు గాను 22,752 సీట్లు 'డైనమిక్‌ ఫేర్‌' కింద అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీయస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విమానయాన సంస్ధలు, రైల్వే శాఖ ఈ డైనమిక్ ఫేర్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీయస్ఆర్టీసీ కూడా ఈ తోవలోకి వస్తోంది.

దీంతో పాటు రివర్స్ బిడ్డింగ్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.370 బస్‌టికెట్‌ ఉందని అనుకుంటే.. ప్రయాణికుడు మొబైల్‌ఫోన్‌లో యాప్‌ ద్వారా రూ.230 కోట్‌ చేయవచ్చు.

APSRTC offers 5-20 percent reduction in the advance reservation

సీట్లు చాలా ఖాళీగా ఉండి, ఆ సమయంలో ఎక్కేవారు ఉండకపోతే టికెట్‌ను రూ.320కి లేదంటే, రూ.310కి ఇస్తానని ఆర్టీసీ ముందుకురావొచ్చు. లేదంటే రూ.370 ఛార్జిలో మార్పులు ఉండకపోవచ్చు. అదేవిధంగా డిమాండ్‌ ఉంటే ఛార్జీ పెంచేసి రూ.430 వరకూ పెంచుకుంటూ వెళ్లే అవకాశమూ ఉంది.

ఆర్టీసీ ప్రవేశపెట్టనున్న ఈ డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. ఏది అయితేనేం ఈ కొత్త విధానం వల్ల ప్రయాణికులు జేబులకు చిల్లు పడనుంది. ఇటీవలే ఛార్జీలను పెంచిన ఆర్టీసీ, కొత్త విధానం ద్వారా ప్రయాణికులు తెలియకుండా భారీ ఎత్తున లాభపడాలనే ఆలోచనలో ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+