10దాకా ఆగండి, చెప్తా: అరవింద్, కెసిఆర్కు అల్టిమేటం

ఆయన శనివారం ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఒంటరిని కాదన్నారు. ఈ నెల 10 తర్వాత అన్నీ చెబుతానని, అయినా తాను ఒక్కడినే మీడియా ముందుకొచ్చి మాట్లాడితే ఏం మజా ఉంటుందని, అప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి వస్తానని చెప్పారు.
అందరం కలిసి మాట్లాడితే ఇంకా మజా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలీనంపై తన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. లేదంటే తనతో పాటు పలువురు కాంగ్రెసులోకి వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణ ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పక పోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన బొగ్గు కార్మిక సంఘం కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు.
మరోవైపు అరవింద్ రెడ్డి విషయంలో తొందరపడి ప్రకటనలు చేయొద్దని కెసిఆర్ పార్టీ నేతలకు సూచించారట. శనివారం కెసిఆర్తో కెక, కడియం తదితరులు సమావేశమయ్యారు. ఈ భేటీలో అరవింద్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. ఆయన కాంగ్రెసు పెద్దలను ఎందుకు కలిశారో ఆరా తీసిన కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారట. అయితే, ఇప్పుడే ఏం మాట్లాడవద్దని సూచించారట.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications