తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, ప్రత్యేక దర్శనాలు రద్దు, బైక్ లు బ్యాన్ ఈవో రెడ్డి !
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15వ తేదీ నుంచి ఈనెల 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) ఈవో ఏవీ. ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని (Tirumala)అన్నమయ్య భవన్లో జిల్లా కలెక్టర్ వెంకట్రమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో కలిసి ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడీలోని (TTD)అన్ని విభాగాలు సమన్వయంతో శ్రీవారి భక్తులకు (devotees) ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. అక్టోబరు 19వ తేదీన గరుడసేవ, 20వ తేదీన పుష్పక విమానం, 22వ తేదీన స్వర్ణరథం, అక్టోబర్ 23వ తేదీన చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమల (Tirumala)నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అక్టోబర్ 19వ తేదీన గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను తిరుమల (Tirumala) ఘాట్ రోడ్డు మార్గంలో అనుమతించరని, తిరుమలకు వచ్చే భక్తులు (devotees) ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని టీటీడీ (TTD)ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు.
గరుడసేవనాడు గరుడ వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు (devotees) తిరుమలలోని (Tirumala) గ్యాలరీలలో వేచి ఉంటారని టీటీడీ (TTD)ఈవో ధర్మారెడ్డి అన్నారు. కావున భక్తుల సౌకర్యార్థం గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు సాధ్య సాధ్యాలను అర్చకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామని టీటీడీ (TTD)ఈవో ధర్మారెడ్డి మీడియాకు చెప్పారు.

అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో (Tirumala)జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులకు (devotees) ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడానికి టీటీడీతో (TTD)సమన్వయం చేసుకొని అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
అంతకుముందు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి విభాగాల వారీగా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో టీటీడీ (TTD) జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications