Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: 90 శాతం నిధులిచ్చేందుకు కేంద్రం ఒకే, ప్రత్యేక హోదాపై చర్చ: హరిబాబు

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా 90 శాతం నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ హమీ ఇచ్చారని బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రకటించారు.ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా, అదే ఆర్థిక ప్రయోజనాలను అందిస్తామని జైట్లీ భరోసా ఇచ్చారని హరిబాబు చెప్పారు.

ఏపీ రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిదుల కేటాయింపు విషయంలో న్యాయం జరగలేదని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. బిజెపి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి కూడ బిజెపి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది.

దీంతో టిడిపి, బిజెపి ప్రతినిధులు సోమవారం రాత్రి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాల.పై చర్చించారు. ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయమై చర్చించారు. మరోసారి కూడ సమావేశం కావాలని నేతలు నిర్ణయం తీసుకొన్నారు. అయితే కేంద్రం నుండి స్పష్టత వచ్చేవరకు టిడిపి ఎంపీల నిరసన పార్లమెంట్ సమావేశాల్లో కొనసాగనుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా 90 శాతం నిధులిస్తారు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా 90 శాతం నిధులిస్తారు


ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కానీ, హోదాతో సమానమైన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రానికి అందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒప్పుకొన్నారని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. ఈ 60, 90 శాతానికి మధ్య ఉన్న నిధులు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయి, ఈ నిధులన్నింటీని ఏపీకి ఎలా ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగిందని హరిబాబు చెప్పారు.

మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది

మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది


ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలను రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుందన్న భావన ఉందని, ఆర్థికలోటు భర్తీ అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై స్పష్టత వస్తుందని తెలిపారు.

ప్రత్యేక హోదాపై చర్చ

ప్రత్యేక హోదాపై చర్చ

ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందోననే విషయమై చర్చించారు. ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కేంద్రం అందించే విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలల్లో ప్రత్యేక హోదా ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. 10 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి. హోదా లేకపోతే 60 శాతం కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలనే విషయమై చర్చించినట్టు కంభంపాటి హరిబాబు చెప్పారు.

విభజన సమస్యలపై చర్చ

విభజన సమస్యలపై చర్చ

ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలపై కూడ ఈ సమావేశంలో చర్చించినట్టు బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు, రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హమీలను నెరవేర్చకపోతే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేతలు జైట్లీ దృష్టికి తీసుకెళ్ళారు.

 న్యాయపరమైన హక్కులపై చర్చ

న్యాయపరమైన హక్కులపై చర్చ

న్యాయపరమైన హక్కులను అమలు చేయాలనే విషయమై చర్చించినట్టు బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు. ఈ విషయమై ఇతర మంత్రులతో కూడ చర్చిస్తానని జైట్లీ తమకు చెప్పారని హరిబాబు గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+