లిఫ్ట్ ఇస్తానని హైదరాబాదులో బీటెక్ యువతిపై రేప్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలో దారుణం జరిగింది. ఈ బీటెక్ విద్యార్థిని పైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా కీసరలో ఆ విద్యార్థిని పైన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలు వెళుతున్న సమయంలో నిందితుడు లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆమెను తన వాహనం పైన ఎక్కించుకున్నాడు. అయితే, ఆమెను జవహర్ నగర్ డంప్ యార్డుకు తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడిని నరేష్గా గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అదృశ్యమైన యువతీయువకుల మృతదేహాలు లభ్యం
అదిలాబాద్ జిల్లా జైనూరు మండలం కిలిమిడిలో యువతీ యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రత్యూష, ప్రవీణ్ అనే యువతీ యువకులు ఈ నెల 3వ తేదీన అదృశ్యమైనట్లుగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. లభించిన మృతదేహాలు వారివేనని పోలీసులు గుర్తించారు.