రోజుకు రెండు లోక్ సభ నియోజకవర్గాలపై బాబు సమీక్ష.!లోపాలు అదిగమించేందుకు టీడిపి ప్రయత్నాలు.!!
అమరావతి/ హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉండటంతో అభ్యర్ధుల ఎంపిక వ్యవహారంలో వేగం పెంచుతున్నారు టీడీపీ అధ్యక్షుడ చంద్రబాబు నాయుడు. నేటి నుంచి రోజుకు రెండు పార్లమెంటు స్థానలపై సమీక్షలు నిర్వహించి అభ్యర్ధులను ఖారారు చెయ్యడానికి చంద్రబాబునాయుడు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో రోజుకు 14 అసెంబ్లీ స్ధానాలకు కూడా అభ్యర్ధుల ఎంపిక పూర్తవుతుందనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు సమాచారం. ఒక్కో అసెంబ్లీ పరిధి నుంచి 60 మంది క్రియాశీలక నాయకులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అభ్యర్ధుల ఎంపికలో నియోజకవర్గ పరిశీలకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
నేడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు, నర్సాపురం పార్లెమెంటు స్ధానాలపై సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. నరసాపురం పార్లమెంటు పరిధిలో పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు, నరసాపురం అసెంబ్లీ స్ధానల్లో సిట్టింగులకే అవకాశం ఉంటుందని, భీమవరం, తాడేపల్లిగూడెం, స్ధానాలకు కొత్త అభ్యర్ధులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో దెందులూరు, ఉంగుటూరు స్ధానాలు తప్పి మిగిలిన స్ధానాల్లో సిట్టింగులను మార్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. పోలవరం, చింతలపూడి, ఏలూరు, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ స్ధానాల్లో సిట్టింగ్ శాసనసభ్యులకు ఈ సారి అవకాశం దక్కకపోవచ్చని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications