అఖిలపక్షం: పవన్, జగన్, బిజెపిల ఆహ్వనానికి మంత్రులు
అమరావతి:ప్రత్యేక హోదా విషయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హజరుకావాలని జనసేన, వైసీపీ, బిజెపి నేతల వద్దకు మంత్రులు పంపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం అమరావతిలో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొన్నారు. అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు హజరయ్యేలా చూడాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ, జనసేన, బిజెపి నేతలు హజరుకాలేదు. దీంతో ఈ మూడు పార్టీల నేతలను అఖిలపక్ష సమావేశానికి హజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు మంత్రులు, టిడిపి నేతలు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహించే ప్రాంతానికి వెళ్ళి అఖిలపక్ష సమావేశానికి హజరుకావాలని పిలవనున్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను కూడ ఇదే విషయమై మంత్రులు, సీనియర్ టిడిపి నేతలు వెళ్ళి అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వనం పలకనున్నారు. బిజెపి నేతలకు కూడ మంత్రులు, సీనియర్ నేతలు వెళ్ళి ఆహ్వనాలు పంపనున్నారు.
అఖిలపక్ష సమావేశానికి ఈ మూడు పార్టీలు హజరుకాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని పార్టీలను కలుపుకు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేసిందనే సంకేతాలు వెళ్ళినట్టుగా ఉంటుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది.
రాకపోతే విపక్షాలు రాష్ట్రప్రభుత్వానికి సహకరించలేదనే విమర్శలు చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కనుంది. మరోవైపు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామనే సంకేతాలను ఇచ్చేందుకు మంత్రులు, సీనియర్ నేతలు ఈ మూడు పార్టీల నేతల వద్దకు వెళ్ళనున్నారని సమాచారం.
-
స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాల ఉద్యోగుల్ని ఇకపై ఇలా.. సీఎం కీలక ఆదేశాలు..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications