హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజాదర్బార్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. పట్టణంలోని సాయి ఫంక్షన్‌హాల్‌లోని ర్వహించిన ఈకార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం రెండ్రోజుల పాటు కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. బుధవారం హిందూపురం మున్సిపాల్టీ పరిధిలోని 38 వార్డులకు సంబంధించిన సమస్యలపై అర్జీలను స్వీకరిస్తున్నారు.

Balakrishna participates in Praja Darbar

బాలకృష్ణ నిర్వహించిన ప్రజాదర్బారుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతిపత్రాలు సమర్పించారు. అలాగే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన పనులపై ప్రజల సమక్షంలోనే బాలకృష్ణ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాగా, గురువారం హిందూపురం రూరల్‌, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లోని సమస్యలపై అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న స్పీకర్‌ కోడెల

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కోడెల స్థానికులతో కలిసి చీపురు పట్టి రోడ్లను శుభ్రపరిచారు.

English summary
Telugudesam MLA Balakrishna on Wednesday participated Praja Darbar held in Hindupur, Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X