హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిని చూస్తే గర్వంగా ఉంది, వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి: బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీలో ప్రాణాలు త్యాగం చేసే కార్యకర్తలు ఉన్నారని, వారిని చూస్తే గర్వంగా ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీలో ప్రాణాలు త్యాగం చేసే కార్యకర్తలు ఉన్నారని, వారిని చూస్తే గర్వంగా ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టిడిపికి ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

Balakrishna talks about TDP activists

పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలన్నారు. గుడివాడకు నందమూరి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. గుడివాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఎన్టీఆరేనన్నారు.

గుడివాడలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డు కమిటీ అభినందన సభకు బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం బాలకృష్ణ మాట్లాడారు.

English summary
Telugu Desam Party leader Hindupuram MLA Nandamuri Balakrishna on Saturday talk about party activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X