బోటు ప్రమాద ఎఫెక్ట్: బల్లకట్టు నిలిపేత.. అప్రమత్తమైన అధికారులు..
చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా-గుంటూరు మధ్య తిరిగే బల్లకట్టును నిలిపేశారు.
విజయవాడ: కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం, ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన బోటు విషాదంతో జిల్లావ్యాప్తంగా అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లాలో నడుస్తున్న వివిధ బోట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Recommended Video

Boat Mishap : Chandrababu Naidu Statement In AP Assembly
తాజాగా కృష్ణా,గుంటూరు జిల్లాల మద్య కృష్ణానదిపై ఏళ్ల తరబడి రాకపోకలు సాగిస్తున్న బల్లకట్టులపై అధికారులు దృష్టి సారించారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా-గుంటూరు మధ్య తిరిగే బల్లకట్టును నిలిపేశారు.

బల్లకట్టు యాజమాన్యం సరైన పత్రాలు చూపించకపోవడం.. లైఫ్ జాకెట్స్ కూడా లేకపోవడంతోనే బల్లకట్టును నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. జిల్లాలోని మరిన్ని చోట్ల అధికారుల తనిఖీలు ముమ్మరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications