మండుతున్న ఎండలు: హాట్ కేకుల్లా బీర్ల అమ్మకాలు, వైద్యులేమంటున్నారు?
కృష్ణా: మండుతున్న ఎండలతో విజయవాడలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సుమారు 40 శాతం అధికంగా బీర్ల అమ్మకాలు జరగినట్లు మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో చల్లని బీరు తాగితే ఉపశమనంగా ఉంటుందని భావిస్తున్న కస్టమర్లు అధిక సంఖ్యలో వస్తున్నారని వారు చెబుతున్నారు.
ఉదయం పది గంటలు దాటితే చాలు బారు షాపులకు మందుబాబులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా, ఎండాకాలంలో చల్లని బీరు తగిలితే హాయిగా ఉంటుందని, వడదెబ్బ తగలదనే అభిప్రాయం తప్పని వైద్యులు అంటున్నారు. బీరు తాగితే కడుపులో చల్లగా ఉంటుందని అనుకోవడం ఒక భ్రమ మాత్రమేనని చెబుతున్నారు.

శరీరాన్ని కూల్ చేయడానికి మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటివి తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమరం మాట్లాడుతూ.. సమ్మర్లో చల్లని బీరు తాగితే హ్యాపీగా ఉండొచ్చని, వడదెబ్బ బారిన పడకుండా ఉంటామనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
చల్లని బీరు తాగితే చల్లగా ఉండే బదులు చివరకు ప్రాణం మీదకు వస్తుందన్నారు. ఎండలో చల్లని బీరు మంచిదని బార్ షాపుల వాళ్లు చేసే ప్రచారం తప్పా, అందులో ఎటువంటి వాస్తవం లేదని సమరం తేల్చి చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని పలువురు చెబుతున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications