జగన్ సంచలనం: రాజధాని అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం -అసెంబ్లీ భేటీకి ముందే కరకట్ట రోడ్డుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వివాదం ఇంకా సమసిపోకముందే, ఇంకొద్ది రోజుల్లోనే ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సంబంధిత కేసుల విచారణ పున:ప్రారంభం కావాల్సి ఉండగా, అతి త్వరలోనే రాజధాని విశాఖపట్నానికి తరలిపోనుందని వైసీపీలో టాప్-2 నేత విజయసాయిరెడ్డి ఘంటాపథంగా చెబుతున్నవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన రీతిలో అమరాతిలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు..

అమరావతిలో జగన్ పూజలు..
మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కరోనా ముందు వరకు అమరావతి ప్రాంతంలో సీఎం జగన్ గానీ, వైసీపీ నేతలుగానీ సెక్యూరిటీ లేకుండా తిరిగిన సందర్భాల్లేవు. కరోనా కారణంగా ఇప్పుడక్కడ రైతుల ఆందోళనలకు బ్రేక్ పడింది. అయితే కొందరు రైతులు మాత్రం ఇళ్లలోనే నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధానుల వివాదం మాటెలా ఉన్నా ప్రస్తుత రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ కావొద్దని భావిస్తోన్న సీఎం జగన్ కీలకమైన పనులను గురువారం భూమి పూజలు చేయనున్నారు.

నాలుగు లేన్ల కరకట్ట రోడ్డు..
అమరావతిలో గురువారం సీఎం జగన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు సీఎం భూమిపూజ చేయనున్నారు. కరకట్ట విస్తరణ పనులకు కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేస్తారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు 15 కిలోమీటర్ల రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. దాంతోపాటు రాజధానిలోని కొన్ని ప్రధాన రహదారులు, హ్యాపీనెస్ట్ తదితర ప్రాజెక్టులనూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. గురువారం..

శంకుస్థాపన ఆపై శాసనసభకు..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు వెళ్లే ముందు సీఎం జగన్ అమరావతి కరకట్ట రోడ్డు నిర్మాణ భూమిపూజలో పాల్గొంటారని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. అమరావతి కరకట్ట రోడ్డు విస్తరణ వల్ల ఇబ్రహీంపట్నం, వెంకటపాలెం మధ్య నిర్మించే ఐకాన్ బ్రిడ్జి, కాజ టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించ తలపెట్టిన బైపాస్ రోడ్ అనుసంధానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. కరకట్టరోడ్డు నిర్మాణానికి ఫిబ్రవరిలోనే మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications