రాష్ట్రపతికి వినతి: ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించండంటూ తెలంగాణ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించండంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్రపతికి విన్నవించారు. ఇదేంటి భద్రాచలం తెలంగాణలో ఉంది కదా.... ఏపీలో ప్రాతినిధ్యం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?
బొల్లారంలో సోమవారం రాష్ట్రపతిని కలిసిన సున్నం రాజయ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఏపీ పరిధిలో విస్తరించి ఉన్న నేపథ్యంలో తనకు ఏపీ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది.

ఏపీ రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో కలిపిన సంగతి తెలిసిందే. ఆ మండలాలను ఏపీలో కలిపినా... వారికి తెలంగాణలోనే ఓట్లు ఉండటం విశేషం.
ఇటీవల జరిగిన తెలంగాణ స్దానిక సంస్ధల ఉప ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు కీలకంగా మారారు. దీంతో ఈ ఏడు మండలాల ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎవరూ రాకపోవడంతో ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్తో భేటీ అయిన సున్నం రాజయ్య ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
ఇది ఇలా ఉంటే రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన నక్షత్రవాటిక ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రారంభించారు. అనంతరం సూర్య అనే పేరు గల మొక్కను నాటి నీరు పోశారు.
రాష్ట్రపతి నిలయానికి సమీపంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. గవర్నర్ నరసింహాన్, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్రపతి భవన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంగళవారం సీఎంలకు రాష్ట్రపతి విందు
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీ మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, త్రివిధ దళాల అధికారులను ఆహ్వానించారు. మొత్తం 400 మందికిపైగా ఆహ్వానాలు అందినట్టు సమాచారం.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications