జగన్ దంపతులకు భారీ ఊరట: అనుకూలంగా తీర్పు
ఆస్తి పంపకాల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువడించింది. జగన్ దంపతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన షేర్ల వ్యవహారంలో జగన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన గత ఏడాది సెప్టెంబర్ లో ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. షేర్ల బదిలీ అక్రమమని వాదించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా క్లాట్ లో పిటీషన్ దాఖలు చేశారు.

క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగన్, ఆయన భార్య వైఎస్ భారతి ఈ పిటీషన్ వేశారు. ఈ కేసులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.
కంపెనీల యాక్ట్ 59 కింద వైఎస్ జగన్ తరఫున వై సూర్యనారాయణ సెప్టెంబర్ 10వ తేదీన ఈ పిటీషన్ను దాఖలు చేశారు. దీన్ని క్లాట్.. విచారణకు స్వీకరించింది. కంపెనీ యాక్ట్ క్లాజ్ 59 ప్రకారం- సరైన కారణాలు లేకుండా ఒక కంపెనీ రిజిస్టర్లో ఒకరి పేరును నమోదు చేయడం లేదా తొలగించితే.. దాన్ని సరిదిద్దాలని కోరుతూ బాధిత పక్షం క్లాట్లో అప్పీల్ చేసుకోవచ్చు.
ఈ క్లాజ్ కిందే వైఎస్ జగన్, వైఎస్ భారతి క్లాట్లో పిటీషన్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురోగతి సాధించడానికి తాము కీలక పాత్ర వహించామని జగన్, భారతి తమ పిటీషన్లో పొందుపరిచారు. ఈ కంపెనీలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో షర్మిలకు వాటాలు ఇవ్వడానికి అంగీకరించారు.
ఈ మేరకు 2019 ఆగస్టు 21వ తేదీన ఒక అవగాహన ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నారు. సరస్వతి పవర్స్ ద్వారా షర్మిలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, అందులో వాటా ఇవ్వడానికి ఉద్దేశించిన ఒప్పందాలపై జగన్, భారతి సంతకం చేశారు. ఈ వాటాల కేటాయింపు ఇంకా ఖరారు కాలేదు.
ఈ కేసులో క్లాట్.. కొద్దిరోజుల కిందటే వాదనలను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కొద్దిసేపటి కిందటే తుది తీర్పు వినిపించింది క్లాట్. వైఎస్ జగన్- భారతిలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. షేర్ల బదిలీని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. షేర్ల బదిలీ అక్రమమని పిటీషన్ దాఖలు చేసిన జగన్ తరఫు న్యాయవాది వాదనలతో క్లాట్ ఏకీభవించింది. నిలిపివేయాలని తుది తీర్పు ఇచ్చింది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications