గుంటూరులో ఓ హోటల్ లో బర్త్ డే పార్టీ .. కాల్ గర్ల్స్ తో .. రేవ్ పార్టీనా ?పోలీసుల విచారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు అరండల్ పేట లోని ఓ హోటల్ లో జరిగిన బర్త్ డే పార్టీ స్థానికంగా చర్చనీయాంశమైంది. గుంటూరు అరండల్ పేట లోని హోటల్ లో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో కాల్ గర్ల్స్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు . ఈ తనిఖీలలో స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఏపీలో మహిళలపై దాడులు గత రెండేళ్లుగా పెరిగాయని జాతీయ మహిళా కమిషన్కు టీడీపీ నేత అనిత లేఖ
హోటల్ లో జరిపిన దాడుల్లో పోలీసులు బెంగళూరుకు చెందిన ముగ్గురు అమ్మాయిలను, అలాగే బర్త్ డే పార్టీ నిర్వహించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించారు పోలీసులు. అయితే హోటల్లో ఏం జరిగింది, రేవ్ పార్టీ ఏమైనా నిర్వహించారా ? హోటల్ యాజమాన్యానికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్ నిర్వాహకులను సైతం ప్రశ్నిస్తున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ పార్టీ ఎవరు నిర్వహించారు అనేది మాత్రం పోలీసులు గుట్టుగా ఉంచుతున్నారు .
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అసలే కరోనా మహమ్మారి తో రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం గా ఉన్న సమయంలో ఇలాంటి పార్టీలు సైతం పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఇటు హైదరాబాద్ లోనూ రేవ్ పార్టీ కల్చర్ బాగా పెరిగింది. హైదరాబాద్ శివారు రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.