బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా వీర్రాజు - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారయ్యారు. టీడీపీ మూడు, జనసేన - బీజేపీ చెరో స్థానం దక్కించుకున్నారు. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసారు. నాలుగు సీట్ల పైన తర్జన భర్జన ల తరువాత బీజేపీకి సీటు ఖరారైంది. చివరి నిమిషంలో బీజేపీ ఢిల్లీ నేతలు ఎంట్రీ ఇవ్వటంతో టీడీపీ ఒక సీటు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో.. టీడీపీ మూడు స్థానాలకే తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇక, బీజేపీ అభ్యర్దిగా పార్టీ నాయకత్వం తుది కసరత్తు తరువాత అధికారిక ప్రకటన చేసింది.
బీజేపీ అభ్యర్దిగా
కూటమిలో బీజేపీ అనుకున్నది దక్కించుకుంది. ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు దక్కించుకున్న బీజేపీ.. మరో సీటు పైన తేల్చి చెప్పింది. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ సీటును ఖాయం సొంతం చేసుకుంది. పార్టీ అభ్యర్దిగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పార్టీ ఖరారు చేసింది. గతంలో ఇదే పొత్తులో భాగంగా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. తొలి నుంచి బీజేపీలో అంకిత భావంతో పని చేస్తున్న సోము వీర్రాజును పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి జాతీయ కమిటీలో అవకాశం కల్పించారు. సోము స్థానంలో పురందేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు.

వీర్రాజు పేరు ఖరారు
సోము వీర్రాజును పార్టీ అభ్యర్దిగా అధికారికంగా ప్రకటించారు. ఏపీ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న సోము వీర్రాజుకి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఖరారు చేయటం ద్వారా బీజేపీ ప్లాన్ ఏంటో స్పష్టం అవు తోంది. వీర్రాజుతో పాటుగా మాధవ్, మరో ఇద్దరు నేతల పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నాయి. చివరగా వీర్రాజు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. ఇప్పటికే నాగబాబుకు జనసేన నుంచి ఎమ్మెల్సీ సీటు ఖాయం కావటంతో..ఇక కూటమి నుంచి అదే సామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఉండదని భావించారు. ఇప్పుడు బీజేపీ నిర్ణయంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రణాళికల విషయంలో పక్కా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి అభ్యర్ధులతో కలిసి వీర్రాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చివరి నిమిషంలో
కూటమిలో భాగస్వామిగా బీజేపీకి ప్రస్తుతం ఎమ్మెల్సీ సీటు దక్కింది. కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ సీట్ల విషయం లో తమకే ప్రాధాన్యత కావాలని ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకత్వం కూటమి మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది. ఆర్ క్రిష్ణయ్య రాజీనామా.. తిరిగి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు సైతం బీజేపీకి దక్కనుంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ నేతల ఒత్తిడితో చివరి నిమిషంలో చంద్రబాబు ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వక తప్పలేదు. దీంతో..భవిష్యత్ లోనూ బీజేపీ తమ పట్టు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications