తండ్రి బీజేపీ – కుమారుడు టీడీపీ..ఇది కదా అసలు రాజకీయం

తెలుగుదేశం (టీడీపీ) - భారతీయ జనతా పార్టీ (బీజేపీ) - జనసేన కూటమిలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల కోసం పార్టీలు మారిన కొందరు టీడీపీ నాయకులు, సాంకేతికంగా బీజేపీ, జనసేనలలో కొనసాగుతున్నప్పటికీ తమ మాతృ పార్టీతో బంధాన్ని తెంచుకోలేకపోతున్నారు. దీనితో, తమ స్థానంలో తమ వారసులను ప్రోత్సహించాలని టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తాము ఇతర పార్టీల్లో ఉన్నా, టీడీపీ వ్యవహారాలన్నీ తమ నియంత్రణలోనే ఉండేలా చూసుకుంటున్నారు.

టీడీపీ వ్యూహం: మిత్రపక్షాల నియోజకవర్గాల్లో పట్టు
టీడీపీ అధిష్టానం కూడా మిత్రపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 31 నియోజకవర్గాల్లో కొత్తగా ఇన్‌ఛార్జ్‌లను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీకి కేటాయించిన 10, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న 21 చోట్ల కొత్తగా టీడీపీ నేతలకు బాధ్యతలు అప్పగించాలని కసరత్తు జరుగుతోంది. మొత్తం 31 సీట్లకు గానూ, కూటమిలోని బీజేపీ, జనసేన 29 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని టీడీపీ నిర్ణయించింది.

BJP MLA s son appointed as TDP in-charge of Anaparthi constituency

అనపర్తిలో ఆసక్తికర పరిణామం: తండ్రి బీజేపీ - కుమారుడు టీడీపీ
ఈ పరిణామాలన్నింటిలోనూ అనపర్తి నియోజకవర్గం అత్యంత ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అనపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్‌ను నియమించాలని టీడీపీ భావిస్తోంది. తండ్రి బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా, కుమారుడిని టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించడంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఎన్నికల ముందు అనపర్తిని బీజేపీకి కేటాయించగా, అప్పట్లో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తిరుగుబాటు చేశారు. దీంతో, నల్లమిల్లిని టీడీపీ నుంచి బీజేపీలోకి పంపి, ఆ పార్టీ తరపున పోటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే, సాంకేతికంగా బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ, నల్లమిల్లి టీడీపీతో తన సంబంధాలను వదులుకోలేకపోతున్నారు. తనకు టీడీపీయే శాశ్వతమనే భావనలో ఉన్న నల్లమిల్లి, తనకు ప్రత్యామ్నాయంగా మరో నాయకుడికి అనపర్తి టీడీపీ పగ్గాలు అప్పగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

తెర వెనుక తండ్రి - తెర ముందు తనయుడు
ప్రస్తుతం కొత్త ఇన్‌ఛార్జ్‌ల అన్వేషణను టీడీపీ ప్రారంభించగానే, ఎమ్మెల్యే నల్లమిల్లి తన కుమారుడు మనోజ్‌ను రంగంలోకి దించారు. కూటమిలో ఐకమత్యం దెబ్బతినకుండా తాను తెరవెనుక ఉండి, తన కుమారుడిని టీడీపీలో యాక్టివ్ చేయాలని చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా మనోజ్‌కు అనపర్తి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో, తండ్రి కమలం పార్టీలో ఉన్నా, కుమారుడు పచ్చ కండువా కప్పుకుని నియోజకవర్గంలో చక్రం తిప్పాలని చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+