గుజరాత్ ను చూసి నేర్చుకోండి-వైసీపీ, టీడీపీకి బీజేపీ ట్వీట్-హెరిటేజ్ పాలు, భారతీసిమెంటేగా..
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ.. మరోవైపు టీడీపీకీ సమదూరం పాటిస్తోంది. అధికారిక సమావేశాల్లో మాత్రమే జగన్, చంద్రబాబును ఆహ్వానిస్తున్న కేంద్రం.. మిగతా విషయాల్లో మాత్రం రాజకీయంగానే ఆలోచిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా గుజరాత్ లో తమ పార్టీ సాధించిన గెలుపును గుర్తుచేస్తూ బీజేపీ ఇవాళ వైసీపీ, టీడీపీలకు ఓ ట్వీట్ పెట్టింది.
అభివృద్ధి ఎజెండాతో గుజరాత్ లో బిజెపి ఏడు సార్లు గెలిచిన ఫలితాలను చూసి ఏపీలో ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాలని ఈ ట్వీట్ లో వైసీపీ, టీడీపీని ఆ పార్టీ దెప్పి పొడిచింది. రాష్ట్రంలో 2024లో పంచడానికి ఏముంది హెరిటేజ్ పాలు, భారతి సిమెంట్ కంపెనీల ఆదాయం తప్ప అంటూ వ్యాఖ్యానించింది. ఏపీలో మరీ బరితెగించి నిన్న చంద్రబాబు వడ్డీతో సహా పాత సంక్షేమ పథకాలను అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఇస్తాము అని చెప్పడం తెదేపా పార్టీ దివాలాకోరు ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనమంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది.

అభివృద్ధి ఎజెండాతో గుజరాత్ లో బిజెపి ఏడు సార్లు గెలిచిన ఫలితాలను చూసి ఏపీలో ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాలి.
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) December 10, 2022
రాష్ట్రంలో 2024లో పంచడానికి ఏముంది హెరిటేజ్ పాలు, భారతి సిమెంట్ కంపెనీల ఆదాయం తప్ప. (1/3)
అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారి మళ్లించి సీఎం @ysjagan రాష్ట్రాన్ని 90% నాశనం చేస్తే ,నేను 100% నాశనం చేస్తాను అని మాజీ సీఎం @ncbn చెప్పడం సిగ్గుచేటని ఏపీ బీజేపీ ట్వీట్లో మండిపడింది.
ఏపీలో మరీ బరితెగించి నిన్న చంద్రబాబు వడ్డీతో సహా పాత సంక్షేమ పథకాలను అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఇస్తాము అని చెప్పడం తెదేపా పార్టీ దివాలాకోరు ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనం. (2/3)
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) December 10, 2022
2024లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ వ్యాఖ్యానించింది. తద్వారా రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలకు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పకనే చెప్పింది. అంతే కాదు ఉచితాలను నమ్ముకుని రాష్ట్ర అభివృద్ధిని ఈ రెండు పార్టీలు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు పరోక్షంగా ఈ ట్వీట్ లో చెప్పారు.
అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారి మళ్లించి సీఎం @ysjagan రాష్ట్రాన్ని 90% నాశనం చేస్తే ,నేను 100% నాశనం చేస్తాను అని మాజీ సీఎం @ncbn చెప్పడం సిగ్గుచేటు.
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) December 10, 2022
2024లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. (3/3)
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications