జగన్కు ఝలక్: టీడీపీలోకి ఎమ్మెల్సీ బొడ్డు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భాస్కర రామారావు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. బొడ్డు భాస్కర రామారావు సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెండో దశ రుణమాఫీని పక్కాగా అమలుచేస్తామని చంద్రబాబు చెప్పారు.

కాగా, గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా పదవులు నిర్వహించారు. గత ఎన్నికల ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు వెంకటరమణ చౌదరికి రాజమండ్రి పార్లమెంటు టికెట్ కోసం ఆయన జగన్ వైపు వెళ్లారనే వాదనలు వినిపించాయి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మంగళవారం ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉండటంతో బొడ్డు చేరిక ఒకరోజు వాయిదా పడింది. భాస్కర రామారావుతోపాటు ఆయన అనుచరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications