పెరట్లో: బొజ్జల ఘాటు చురక, టీడీపీలో రాజధాని రభస
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీలోను గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. రాజధాని విషయంలో రెండు పార్టీల నేతలు తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వస్తున్న డిమాండ్లపై మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గురువారం ఘాటుగా స్పందించారు. సొంత పార్టీ నేతలకు కూడా ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ తమ పెరట్లోనే రాజధాని ఉండేలా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. భూముల లభ్యత, అన్ని ప్రాంతాలకు అనువైన చోటే రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. అయితే, రాజధానిపై ఎవరు మాట్లాడవద్దని ఇరు పార్టీల నేతల అధినేతలు తమ తమ పార్టీ వారిని వారిస్తున్నారు.

బొజ్జల
రాజధాని పైన ఎవరికి వారు మాట్లాడుతుండటంతో, మంత్రి బొజ్జల స్పందిస్తూ.. ప్రతి ఒక్కరు తమ పెరట్లోనే రాజధాని ఉండేలా ఆలోచిస్తున్నారని చురకలు అంటించారు.

పీ నారాయణ
విజయవాడ - గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండవచ్చని ఏపీ పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ పలుమార్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

కేఈ కృష్ణమూర్తి
విజయవాడ తాత్కాలిక రాజధానియేనని, పూర్తిస్థాయి రాజధాని కాదని రెండు, మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వం భూమి విజయవాడ - గుంటూరు మధ్య లేదన్నారు.

జేసీ దివాకర్ రెడ్డి
రాయలసీమవాసులు తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చెప్పారు. మాచర్లను రాజధాని చేస్తే బాగుంటుందని ఆయన ఎప్పుడో సూచించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications