బోటు వెలికితీతకు బ్రేక్.. గజఈతగాళ్లు దిగితే తప్ప ఫలితం రాని పరిస్థితి
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది. తన బృందం చేస్తున్న ప్రయత్నాలకు గత ఈతగాళ్ల సహయం ఉంటే తప్ప బోటు బయటకు రాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే బోటులో శవాలు ఉన్నాయనే ప్రచారంతో పాటు మునిగిన ప్రాంతం కొంత ప్రమాదకరంగా ఉండడంతో గజ ఈతగాళ్లు బోటు దగ్గరకు వెళ్లేందుకు తన బృందంలోని సభ్యులు జంకుతున్నారు.

విశాఖకు వెళ్లిన ధర్మాడి సత్యం
దీంతో విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా గజఈతగాళ్లను తీసుకువచ్చి వారితో నేరుగా బోటకు లంగరు వేసేందుకు సత్యం బృందం చర్చలు జరిపేందుకు నేటి ప్రయత్నాలకు బ్రేకులు వేశారు. వారితో చర్చించేందుకు ధర్మాడి సత్యం విశాఖకు వెళ్లారు. దీంతో విశాఖపట్నం నుండి వచ్చి గజఈతగాళ్లు ఆక్సిజన్ సిలిండర్లతో బోటు వద్దకు వెళితే తప్ప బోటు చిక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో విశాఖ ఈతగాళ్ల నిర్ణయంపై బోటు వెలికితీత ఆధారపడి ఉండే పరిస్థితి కనిపిస్తోంది.

50 అడుగుల లోతులో బోటు
సత్యం బృందం రెండవ దఫా బోటును వెలికి తీసేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి తిరిగి నీళ్లలోకి జారీ పోతుంది. దీంతో మూడవరోజు చేసిన ప్రయత్నాల్లో బోటు రెయిలింగ్ ఊడి వచ్చిన పరిస్థితి కనిపించింది. మరోవైపు 50 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు సత్యం బృందం సభ్యులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో లంగరు వేసి, తాళ్లతో బిగిస్తే తప్ప పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

నెలరోజులు గడుస్తున్న బయటకు రాని బోటు
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద మరో రెండు రోజుల్లో ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications