బీటెక్ స్టూడెంట్స్ గొడవ : కత్తితో మెడపై పొడిచి పరారు
చిత్తూరు : సాయిమోహన్, శశిధర్ రెడ్డి అనే ఇద్దరు బీటెక్ విద్యార్థుల మొదలైన చిన్నపాటి ఘర్షణ.. పెద్ద వివాదానికి దారి తీసింది. మాటా మాటా పెరిగి ఇద్దరు కొట్టుకునేంత వరకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన శశిధర్ రెడ్డి సాయిమోహన్ మెడపై కత్తితో పొడిచాడు. అనంతరం శశిధర్ రెడ్డి అక్కడినుంచి పరారవగా ప్రస్తుతం సాయిమోహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాగా, వీరిద్దరు బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులుగా తెలుస్తోంది. స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీయగా.. సాయిమోహన్ చేతులు వెనక్కి కట్టేసి కత్తితో అతని మెడపై తీవ్రంగా దాడి చేశాడు శశిధర్ రెడ్డి. సాయిమోహన్ అరుపులు విన్న కాలేజీ సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి వున్న సాయిమోహన్ని ఆస్పత్రికి తరలించారు. అటుపై సాయిమోహన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం సాయిమోహన్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్థికపరమైన కారణాలే ఇద్దరి మధ్య గొడవకు దారి తీసి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఇద్దరి స్నేహితుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications