యాజమాని ఇంట్లో చోరీ: దొంగను పట్టించిన గేదె
నెల్లూరు: ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగను తన కొమ్ములతో పొడిచి పట్టించింది ఓ గేదె. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా మన్నెంవారిపల్లెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మన్నెంవారిపల్లె నివాసముంటున్న విజయమ్మ తన కుమారుడు, కుమార్తెలతో కలిసి తమ ఇంట్లో నిద్రిస్తోంది. అదే సమయంలో రాత్రి ఒంటిగంట తర్వాత నలుగురు దుండగులు వారింట్లో దొంగతనానికి వచ్చారు.

విజయమ్మ మెడలోని బంగారు గొలుసును, చెవి కమ్మలను లాక్కున్నారు. దీంతో బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. కంగారుపడిన దొంగలు పరుగు లంఘించారు. కాగా, వీరిలో ఒకరిని ఇంటి ఆవరణలో ఉన్న గేదె తన కొమ్ములతో పొడిచేసింది.
దీంతో గాయపడిన ఆ దొంగ అక్కడే పడిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు అతడ్ని పట్టుకుని చితక్కొట్టారు. ఆ తర్వాత ఆ దొంగను పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మిగితా దొంగల కోసం గాలింపు చేపట్టారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications