నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చలివేంద్రాల్లో మజ్జిగ, తాటిముంజలు: మంత్రితో రిబ్బన్ కటింగ్, చేసేది చీటింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఎండాకాలం నేపథ్యంలో రోడ్డు పైన మనం చలివేంద్రాలు చూస్తూనే ఉంటాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చలివేంద్రంలో తాటి ముంజలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో టిడిపి అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఓ చలివేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు.

ముంజలు పంపిణీ చేశారు. విపరీతమైన ప్రచారం వచ్చి అక్కడ జనాల వరుస కట్టారు. దీంతో, ఓ కార్పొరేటర్ తన వార్డులో తాటి ముంజలతో పాటు కొబ్బరి బోండాలు, మజ్జిగ అంటూ చలివేంద్రాన్ని ప్రారంభించారు.

Buttermilk in Nellore Chalivendram

దీనిని ఓ మంత్రితో అట్టహాసంగా ప్రారంభింపజేశారు. ఇక్కడకు కూడా జనాలు వరుస కట్టారు. సదరు కార్పోరేటర్ మరోచోట ఫ్రూట్ జ్యూస్, ఐస్‌క్రీంలను కూడా కలిపి మరో చలివేంద్రాన్ని మరో మంత్రిని పిలిచి ప్రారంభించారట.

ఈ చలివేంద్రానికి బాగానే ప్రచారం లభించింది. ఆ చలివేంద్రాలకు నెల్లూరువాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే, ఈ ధాటి తట్టుకోలేకపోతున్నారు. దీంతో, అక్కడ వాటిని పంపిణీ చేయడం లేదో లేక కొరత వచ్చిందో తెలియదు కానీ.. అక్కడకు ఆ తర్వాత వస్తున్న వారికి మజ్జిగ, ఐస్ క్రీం కనిపించడం లేదంటున్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఉండటం లేదంటున్నారు.

English summary
Buttermilk distributed in SPS Nellore district Chalivendram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X