చంద్రబాబుతో నేరుగా, ఇటు కేసీఆర్ 'ఫిక్స్' - రేవంత్ అనూహ్య నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. పాలనా పరంగా- రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో కీలక అంశాల పైన చర్చ చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టు పైన నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుతోనే చర్చించాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా బీఆర్ఎస్ లో నెలకొన్ని తాజా పరిస్థితులు.. వెంటాడుతున్న విచారణల వేళ.. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కేసీఆర్ ను ఫిక్స్ చేసేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు.
చంద్రబాబుతో చర్చలు
ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో బనకచర్ల అంశం పైన ప్రధాన చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ అంశం పైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు స్పందించారు. తమ వైఖరి స్పష్టం చేసారు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. రాజకీయంగా తెలంగాణలో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. ఈ రోజు జరిగే భేటీలో మంత్రివర్గ సహచరులకు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ లక్ష్యం ఏంటి... కేంద్రం ఏ ఆలోచన చేస్తుందీ.. తెలంగాణ ప్రభుత్వ విధానం పైన మంత్రులకు సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వనున్నారు. ఇక, నేరుగా చంద్రబాబును ను ఈ అంశం పైన చర్చలకు ఆహ్వానించాలని రేవంత్ భావిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం ద్వారా ఈ సమస్య పైన ఒక నిర్ణయానికి రావాలనేది సీఎం రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది.

స్థానిక సమరం
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రోజు జరిగే కేబినెట్ లో భేటీలో ఈ ఎన్నికలతో పాటుగా సర్పంచి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా? పాత రిజర్వే న్ల ప్రకారమే ఈసారికి ముందుకెళ్లాలా అనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కేసీఆర్ ఫిక్స్..
రాజకీయంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం ఇప్పటికే చిక్కుల్లో ఉంది. కాళేశ్వరం కమిషన్ విచార కు కేసీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక, పార్టీలో అంతర్గతంగా సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో.. రాజకీయంగా మరింత పట్టు బిగించే విధంగా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కేబినెట్ భేటీలో సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. దీంతో.. రాజకీయంగా ఈ రోజు జరిగే కేబినెట్ భేటీ కీలకంగా మారుతోంది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications