ఎమ్మెల్యే జైపాల్ కారు, ఆటో ఢీ: 8 మందికి గాయాలు

Car accident in Mahaboobnagar
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం కట్లబండ వద్ద కల్వకుర్తి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు జైపాల్ యాదవ్ కారు ఓ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యీ. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారు.

గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం కట్టబండ వద్ద జరిగిందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే అంగరక్షకులు, రోడ్డుపై వెళ్తున్న ఇతరులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

రెండు లారీలు ఢీ, ముగ్గురి మృతి

కర్నాటకలోని చెల్లకెర సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన వారు.

తాళాలు పగులగొట్టి...

హైదరాబాదులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని బుద్వేలులో నాగరాజు అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లిన సమయంలో.. కొందరు దొంగలు తాళాలు పగులగొట్టి ఇల్లు గుల్ల చేశారు. ఎనిమిది తులాల బంగారు నగరు, ఇరవై తులాల వెండి, లక్ష విలువైన సామాగ్రిని దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+