ఏపీ, టీకి పంపకాలు: కేంద్రం జాగ్రత్త, కేవియట్ పిటిషన్
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల అధికారుల పంపకాల నేపథ్యంలో కేంద్రం క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్)లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలకు అధఇకారుల పంపకాలలో అవాంతరాలు అధిగమించేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అధికారుల పంపకాలలో జాప్యం నివారించడానికి ఈ పిటిషన్ వేసింది. అధికారుల పంపకాలలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రత్యూష్ సిన్హా కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఏ అధికారి అయినా తనకు అన్యాయం జరిగిందని భావిస్తే, ప్రక్రియ ఆగకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యగా ఈ పిటిషన్ వేసింది.
తమకు సమాచారం ఇవ్వకుండా ఆలిండియా సర్వీసుల అధికారుల అభ్యంతరాల పైన ఎలాంటి ఉత్తర్వులు వెల్లడించవద్దని కేంద్రం కోరింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఉద్యోగుల పంపకాలలో మార్పులు లేవని చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రధానికి ఈ జాబితా ఇవ్వనుంది. ఈ కమిటీ నివేదిక పైన ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తగా కేవియట్ దాఖలు చేసింది.