Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్..!
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. తాజాగా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన ఆయన తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు అన్నింటికీ దూరంగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ సీబఈఐ కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. సీబీఐ అభిప్రాయం కూడా తీసుకుంది. అనంతరం విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరుక ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు సాయిరెడ్డికి 15 రోజుల పాటు అనుమతి లభించింది.
వాస్తవానికి ఈ రెండు దేశాల్లో పర్యటనకు విజయసాయిరెడ్డి నెల రోజులు అనుమతి కోరినా కోర్టు మాత్రం 15 రోజులే అనుమతి ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు 15 రోజుల పాటు వెళ్లొచ్చిన తెలిపింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సిద్దమవుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications