పేలిన సెల్ఫోన్:బాలుడికి తృటిలో తప్పిన ముప్పు...పోలీసులకు ఫిర్యాదు
తిరుపతి:సెల్ ఫోన్ లు పేలిపోతున్న ఘటనలకు సంబంధించిన వార్తలు వినియోగదారులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పైగా వీటిలో అత్యధిక భాగం ఛార్జింగ్ పెట్టే క్రమంలో పేలుతుండటంతో ఛార్జింగ్ పెట్టేందుకు భయపడిపోతున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో సోమవారం ఓ బాలుడి చేతిలో సెల్ఫోన్ పేలింది. ఫోన్ ఛార్జింగ్లో ఉండగా ఫోన్ వెనుక భాగం నుంచి పొగలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన బాలుడు ఫోన్ను తీసుకొని దూరంగా విసిరేయడంతో పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయింది. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కొంచెం ఉంటే ఫోన్ బాలుడి చేతి లోనే పేలి ఉండేదని ఆందోళన వెలిబుచ్చారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు సదరు సెల్ ఫోన్ కంపెనీపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications