మోదీ కేబినెట్ లోకి పురందేశ్వరి, టీడీపీ యువ ఎంపీ - కిషన్రెడ్డి, రామ్మోహన్ శాఖల మార్పు..!?
కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కు ప్రధాని మోదీ సిద్దమయ్యారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో.. ప్రభుత్వంలో కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు.. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మార్పులు జరగనున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీకి మరో మంత్రి పదవి దక్కనుంది. ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడుకు శాఖ మార్పులు జరగనున్నట్లు సమాచారం.కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీతో పాటు పలువురు మంత్రులను పదవుల నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ కు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయినందున సీఎం పదవికి ఆయన ఏక్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్ను నియమించవచ్చునని సమాచారం. నితీష్ కుమార్కు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం కల్పించనున్నారు. గతంలో వాజపేయి మంత్రివర్గంలో నితీష్ నిర్వహించిన వ్యవసాయ శాఖను ఆయనకు కేటాయించనున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల నుంచి కీలక మార్పులు
కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న వారి శాఖల్లో మార్పులు ఖాయమైనట్లు సమాచారం. దివంగత నేత ఎర్రన్నాయుడు గతంలో నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కమ్యూనికేషన్ల శాఖలో సహాయమంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కు స్వతంత్ర హోదా లభించవచ్చునని భావిస్తున్నారు. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ బాలయోగి, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిలకు మంత్రివర్గంలో అవకాశం దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే, ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉండటంతో.. బీజేపీకి మరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. కాగా, మిత్రపక్షాలు టీడీపీ- జనసేన నుంచి మరో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందు లో భాగంగా సామాజిక లెక్కల మేరకు హరీష్ బాలయోగి వైపు చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. అయితే, జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటే.. చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!













Click it and Unblock the Notifications