కేంద్రానికి కోపం లేదు, అందువల్లే తగ్గింపు: రాయపాటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రానికి ఎలాంటి కోపం లేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలు వ్యతిరేకించడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తగ్గిందని చెప్పారు.
గుంటూరు జిల్లా పల్నాడులో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు రాయపాటి సాంబశివరావు వెల్లడించారు. గురజాల కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని తాను కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు.
క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు- జేఈవో

తిరుపతి: క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు భక్తులకు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా జేఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రధాన కల్యాణకట్టలో తనిఖీలు నిర్వహించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
క్షురకులు సేవాభావంతో పనిచేయాలని జేఈవో హితవు చెప్పారు. తలనీలాలు సమర్పించే భక్తులు క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా అదనంగా శ్రీవారి సేవకులను నియమిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications