ఏపీకి కేంద్రం రిలీఫ్ - నిధులు విడుదల : రెండు నెలల మొత్తం ఒకేసారి..!!
ఆర్దిక కష్టాలతో సతమతం అవుతున్న ఏపీకి కేంద్రం కొంత ఊరట ఇచ్చింది. ఏపీకి రుణ పరిమితి పెంచాలని కోరుతూ కొంత కాలంగా ఏపీ ఆర్దిక మంత్రితో పాటుగా ఆర్దిక శాఖ అధికారులు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సైతం గత ప్రభుత్వం చేసిన రుణాల కారణంగా..తమ ప్రభుత్వ పరిమితి పెంచకపోవటం పైన ముఖ్యమంత్రి జగన్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం ఈ అంశాలను ప్రస్తావించారు. ఇక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా.. కేంద్ర పన్నుల రాబడి నుంచి ఏపీకి రావాల్సిన రూ.3,847.96 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

రెండు నెలల చెల్లింపులు ఒకే విడతలో
రెండు నెలసరి వాయిదాలకు సంబంధించి 28 రాష్ట్రాలకు కలిపి రూ.95,082 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. సాధారణంగా ఒక్కో నెలకు రూ.47,541 కోట్లు వంతున విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 'పెట్టుబడులు, మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి' అంశాలపై ఈ నెల 15న వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పన్నుల పంపిణీ ప్రక్రియలో భాగంగా ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వివరించింది.

ఏపీకి ఆర్దిక కష్టాల్లో వెసులుబాటు
ఈ నిధుల్లో తెలంగాణకు 1,998.62కోట్లు విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.17,056.66 కోట్లు, అత్యల్పంగా గోవాకు రూ.367.02 కోట్లు విడుదలయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్కు రూ.1,670.58 కోట్లు, అసోంకు రూ.2,974.16 కోట్లు, బిహార్కు రూ.9,563.30 కోట్లు, చత్తీస్ గఢ్కు రూ.3,239.54 కోట్లు, గుజరాత్కు రూ.3,306.94 కోట్లు, హరియాణాకు రూ.1,039.24 కోట్లు, హిమాచల్ప్రదేశ్కు రూ.789.16 కోట్లు, ఝార్ఖండ్కు రూ.3,144.34 కోట్లు, కర్ణాటకకు రూ.3467.62 కోట్లు, కేరళకు రూ.1,830.38 కోట్లు మేర నిధులు కేటాయించారు
Recommended Video

28 రాష్ట్రాలకు 95 వేల కోట్లు విడుదల
మధ్యప్రదేశ్కు రూ.7,463.92 కోట్లు, మహారాష్ట్రకు రూ.6,006.30 కోట్లు, మణిపూర్కు రూ.680.80 కోట్లు, మేఘాలయకు రూ.729.28 కోట్లు, మిజోరాంకు రూ.475.42 కోట్లు, నాగాలాండ్కు రూ.541.02 కోట్లు, ఒడిశాకు రూ.4,305.32 కోట్లు, పంజాబ్కు రూ.1,718.16 కోట్లు, రాజస్థాన్కు రూ.5,729.64 కోట్లు, సిక్కింకు రూ.368.94 కోట్లు, తమిళనాడుకు రూ.3,878.38 కోట్లు, త్రిపురకు రూ.673.32 కోట్లు, ఉత్తరాఖండ్కు రూ.1,063.02 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ.7,152.96 కోట్లు విడుదల చేశారు.
-
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications