తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరం.. మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే
026 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాలకు మరో మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేను మంజూరు చేసింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది. ఏఏ ప్రాంతాలను కలుపుతుంది. ఎంత ప్రయాణ సమయం కలిసి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం
కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 31న జరిపిన చివరి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ రహదారి -326 విస్తరణకు ఆమోదం తెలిపింది. దీని వల్ల గజపతి, రాయగడ కోరాపుట్ లలో ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలతో పాటు, టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే పారిశ్రామిక ప్రగతికి కూడా తొడ్పడుతుందని, గిరిజన ప్రాంతాలలో సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ.. నేషనల్ హైవై -326 ప్రధానమంత్రి గతిశక్తిలో భాగంగా.. ఆరు లేన్లగా మారబోతుంది. ఇద నాసిక్-సోలాపూర్-అక్కల్కోట్ గ్రీన్ఫీల్డ్ కారిడార్తో అనుసంధానం కాబోతుంది. మూడు రాష్ట్రాల మధ్య అతి పెద్ద కనెక్టివిటీని పెంచడంతో పాటు రవాణాను మరింతగా బలోపేతం చేస్తుందని లాజిస్టిక్స్ను పెంచుతుందని కేంద్రం చెబుతోంది.

తెలంగాణకు తగ్గనున్న దూరం..
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే తో ఏపీ నుంచి తెలంగాణాకు ఉన్న 201 కిలోమీటర్లు దూరం సగానికి సగం తగ్గుంది. ఇక దీని వల్ల కోప్పర్తి, ఓర్వకల్ వంటి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి జరుగుతుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే మీద గంటకు 100 కిలో మీటల వేగంతో వెళ్లేలా రూపకల్పన చేస్తున్నారు. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు సాధారణ ప్రయాణం కూడా సాగిపోతుంది
ఏపీకి పెరగనున్న కనెక్టివిటీ
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీలో కీలక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కేంద్రం అంచనా వేస్తుంది. ప్రస్తుతం చెన్నై నుంచి తిరువల్లూరు, రేణిగుంట, కడప, కర్నూలు మీదుగా మహారాష్ట్ర సరిహద్దులలోని హసాపూర్ వరకు నాలుగు-లేన్ల కారిడార్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కేంద్రం తాజాగా ఆమోదించిన ఆరు-లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే తో ఏకంగా ఏపీ నుంచి తెలంగాణాకు ప్రయాణ సమయాన్ని సగానికి పైగా తగ్గిస్తుందని అంచనా. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే మహారాష్ట్రలో 374 కిలోమీటర్లు ఉంటుంది. రూ. 9,142 కోట్లు అంచనా వ్యయం. దీనిని బీవోటీ విధానంలో చేపట్టనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే తో నాసిక్, అహల్యనగర్, సోలాపూర్ వంటి ముఖ్యమైన నగరాలను ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుతో కనెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications