స్వైన్ ఫ్లూ: గాంధీలో విదేశీ మహిళ మృతి, బులెటిన్ విడుదల
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. హైదరాబుదోలని గాంధీ ఆసుపత్రిలో బుధవారం ఓ మహిళ స్వైన్ ఫ్లూతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆమె జింబాబ్వే దేశానికి చెందిన మహిళ (36). చిత్తూరు జిల్లా పలమనేరులో తల్లీకూతుళ్లకు స్వైన్ ఫ్లూ రావడంతో వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు.

స్వైన్ఫ్లూతో మహిళ మృతి
స్వైన్ఫ్లూతో ఒక మహిళ మృతి చెందింది. నగరంలోని కాటేదాన్ శ్రీరాంనగర్కు చెందిన మహిళ సంతోష్ నగర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ రోజు ఉదయం గాంధీ ఆస్పత్రిలో ఎనిమిది నెలల బాలుడు కూడా స్వైన్ఫ్లూతో మృతి చెందిన విషయం తెలిసిందే.
స్వైన్ ఫ్లూ పైన తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 2047 మందికి పరీక్షలు నిర్వహించగా 686 మంది స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. మంగళవారం నాడు 71 మందికి పరీక్షలు చేయగా 18 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు 36 మందికి వరకు మరణించారు.
స్వైన్ఫ్లూ వార్డును పరిశీలించిన మంత్రి పరిటాల సునీత
అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్వైన్ఫ్లూ వార్డును మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్స గురించి ఆరా తీశారు. ప్రస్తుతం అనంతపురం ఆస్పత్రిలో ఇద్దరు స్వైన్ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. స్వైన్ప్లూ వల్ల ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, మందులు లభిస్తున్నాయని మంత్రి పరిటాల సునీత చెప్పారు. వ్యాధి పట్ల ప్రజలు భయవడాల్సిన అవసరం లేదన్నారు. కాగా, స్వైన్ ఫ్లూ పైన కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications