నామినేటెడెడ్ పదవులు ఖరారు - మూడు పార్టీల్లో ఏవరికి ఏంటి..!!
ఏపీలో నామినేటెడ్ పదవుల పై కసరత్తు మొదలైంది. పదవుల భర్తీ పైన చంద్రబాబు, పవన్ చర్చలు చేసినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో మూడు పార్టీలకు దక్కే ప్రాధాన్యత పైన చర్చలు చేసారు. పదవుల భర్తీ పైన ఒక ఫార్ములా సిద్దం చేసారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గాల వారీగా పదవులను ఏ నిష్పత్తిలో ఖరారు చేయాలనేది సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. దీంతో, త్వరలోనే పదవుల భర్తీ ప్రారంభం కానుంది.
ఇదీ ఒప్పందం
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేనల్లో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు ఈ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. అటు నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్ పదవులపైనా అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. వీటి భర్తీపై మూడు పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతాయి. 30 శాతం జనసేన శ్రేణులకు, మిగతా పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.

సర్దుబాటు
అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం పోస్టులు ఆ పార్టీకే. 30 శాతం పోస్టులు టీడీపీకి, 10శాతం బీజేపీ వారికి కేటాయిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50 శాతం పదవులు, మిగిలిన 50 శాతం టీడీపీ, జనసేనలకు దక్కుతాయని సమాచారం. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన నాయకులను గుర్తు పెట్టుకుంటామన్నారు. ఎమ్మెల్యేలంతా కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని, పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యమివ్వాలని సృష్టం చేశారు.
వైసీపీ నుంచి చేరికలు
నియోజకవర్గాల్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి, వారి వివరాలు పంపించాలని కోరారు. కాగా.. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై, ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్న వైసీపీ నాయకులను చేర్చుకునేందుకు నాగబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే టీడీపీ, జనసేన నాయకులపై కేసులు పెట్టని వారిని, వారిని ఇబ్బందులకు గురి చేయని వారిని గుర్తించి, పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే చేర్చుకోవాలని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంతో పాటు కేసులు నమోదైన వారి వివరాలూ పంపించాలని కోరారు.
-
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications