పవన్ కళ్యాణ్ ఆరా తీశారా?: చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ వెనుక?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పలువురు ప్రముఖులు వరుసగా భేటీ అవుతున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అమరావతి రాజధాని నిర్మాణం, భూసమీకరణ, టిడిపి హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు, అమలు చేసినవి, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వద్దకు వెళ్లే తదితర అంశాల పైన చర్చిస్తున్నారని తెలుస్తోంది. రెండు గంటలకు పైగా చంద్రబాబు - పవన్ భేటీ కావడం గమనార్హం.
గంటల పాటు భేటీ అవుతుండటంతో... పలు అంశాల పైన వారు సుదీర్ఘంగా చర్చిస్తున్నారని, పవన్ కళ్యాణ్... సీఎం చంద్రబాబు నుంచి పలు అంశాలపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడతారు.

మరోవైపు, తమిళ నటుడు కమల్ హాసన్ కూడా పాల్గొంటున్నారు. కమల్ హాసన్ భేటీ కావడం పైనా చర్చ సాగుతోంది. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిలో కమల్ హాసన్ పాలుపంచుకోవాలని ఉవ్వీళ్లూరుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై మాట్లాడేందుకు కమల్ హాసన్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, రాజధాని ప్రాంతంలో కమల్ హాసన్ ఓ సంస్థను నెలకొల్పాలని భావిస్తున్నారని సమాచారం. రాజధాని నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించేందుకు చంద్రబాబు అడుగు వేయనున్నారని అంటున్నారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications