టీటీడీ ఆభరణాల ఆరోపణలపై చంద్రబాబు కీలక ప్రకటన: ‘ఆ రూబీ విలువ రూ.50’
అమరావతి: తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమల కొండపై అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో తిరుమల శ్రీవారి నగలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై కీలక ప్రకటన చేశారు.
ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై జుడీషియల్ విచారణ చేపడతామని సీఎం ప్రకటించారు. ఆ జుడీషియల్ కమిటీ ముందే ప్రతి రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

టీటీడీ విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. కొంతమంది లేని నగలు, డైమండ్లు ఉన్నాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా రమణ దీక్షితులు ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. విపక్షాలు చివరికి దేవుడిని సైతం వదిలిపెట్టడం లేదని విమర్శించారు.
రమణదీక్షితులు అసత్య ప్రచారం చేస్తున్నారు: ఆ రూబీ విలువ రూ.50
శ్రీవారి ఆభరణాల విషయంలో అసత్య ఆరోపణలు చేసిన రమణ దీక్షితులుకు ఆ భగవంతుడే గుణపాఠం చెబుతాడని టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. సోమవారం టీటీడీ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. భక్తుల మనోభావాలను రమణ దీక్షితులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
Recommended Video

భక్తులు కానుకలు విసడం వల్ల పగిలిన రూబి విలువ 50 రూపాయలుగా రికార్డులో ఉందని సుధాకర్ తెలిపారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నిజమైతే తిరుమలకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 1952 నుంచి కూడా టీటీడీలో ఎలాంటి ఆభరణాలు పోలేదని టీటీడీ సభ్యుడు బోండా ఉమ తెలిపారు. రమణదీక్షితులు ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications