Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెడ్డి నీకు వడ్డీతో సహ చెల్లిస్తా, చంద్రబాబు, ఈ పెద్దిరెడ్డి ఎయిడ్స్ కంటే ప్రమాదకరం, మాజీ సీఎం!

పెద్దిరెడ్డి నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, మీకు నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపిస్తా, నా కార్యకర్తలను ఎలా క్షోభ పెట్టావో, మీకు అంతే క్షోభ పెడతా అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆవేశంగా అన్నారు. చిన్నాపెద్ద, ఆడామగ అని తేడా లేకుండా అందరిపట్ల వైసీపీ నాయకులు రాక్షలకంటే ఘోరంగా ప్రవర్థిస్తున్నారని, అందరికి వడ్డీతో సహా చెల్లిస్తానని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శపథం చేశారు.

పుంగనూరు, తిరుపతిలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని తీవ్రస్తాయిలో ఆరోపణలు చేశారు. గత ఏడాది తాను, టీడీపీ కార్యకర్తలు అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి పూతలపట్టు వెలుతుంటే మార్గం మధ్యలో పుంగళూరులో పెద్దిరెడ్డి తన అనుచరులతో తన మీద, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేయించారని, నా జీవితంలో ఆనాటి సంఘటన మరిచిపోనని చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu challenged that he will not leave Peddireddy and will see his end

అంగళ్లు, పుంగనూరులో మా మీద వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మా మీద రివర్స్ కేసులు పెట్టారని సుమారు 450 మంది టీడీపీ కార్యకర్తలు, అమాయకులను జైల్లో పెట్టారని, ఆ విషయం తన ప్రాణం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటానని, అంతకు అంత మీకు రిటన్ గిఫ్ట్ ఇస్తానని మాజీ సీఎం చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని హెచ్చరించారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 160కి పైగా ఆలయాలపై దాడులు చేశారని, వైఎస్ జగన్ అండతోనే వైసీపీ మూకలు రెచ్చిపోయారని, చివరికి అర్చకులపై దాడులు చేసి రాక్షసుల్లా ప్రవర్తించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల కూల్చివేత జరిగిందని, వాటిపై విచారణ జరిపించి అందరిని బొక్కలో వేస్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

తిరుమలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తామని శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా తాను మాట ఇస్తున్నానని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీతో సహ అన్ని ఆలయాల్లో బ్రాహ్మణులను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తామని, ఆలయాల వార్షిక ఆదాయం బట్టి అర్చకులను రూ. 15 వేలు, రూ 10 వేలు, రూ 5 వేలు గౌరవ వేతేనం అందిస్తామని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

పుంగనూరులో జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం, రాజంపేట లోక్ సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీవీల్లో, సినిమా థియేటర్లలో ఒక ప్రకటన వచ్చేదని గుర్తు చేశారు. నిమిషం సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ ఓ ప్రకటన ద్వారా ఎయిడ్స్ వ్యాదిపై ప్రజలకు అవగాహన కల్పించేవారని, ఎయిడ్స్ కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ప్రమాదకరం అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+