మా ఊర్లో డాక్టర్లు లేరంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం
తన స్వంత గ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
విజయవాడ:తన స్వంత గ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు రెండో రోజు విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సమీక్షలు నిర్వహించారాయన.

ప్రజాసాధికార సర్వే వివరాలను పీపుల్స్ హజ్ పేరిట ప్రభుత్వం భద్రపరిచింది. ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు సిఎం. ప్రజాసాదికార సర్వే 80 శాతం పూర్తైందన్నారు. మిగిలిన 20 శాతాన్ని మూడు నెలల్లో పూర్తిచేస్తామని ఐటీ అధికారులు సీఏంకు తెలిపారు.
ఆసుపత్రుల్లో వైద్యుల కొరతపై అధికారులను సీఎం నిలదీశారు. వైద్యుల కొరత సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే అవుట్ సోర్సింగ్ పద్దతిలో వైద్యులను రిక్రూట్ చేసుకోవాలని సూచించారు. తన స్వగ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందన్నారు. కిడ్నీ బాధిత ప్రాంతాలైన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications