మా ఊర్లో డాక్టర్లు లేరంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం
తన స్వంత గ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
విజయవాడ:తన స్వంత గ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు రెండో రోజు విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సమీక్షలు నిర్వహించారాయన.

ప్రజాసాధికార సర్వే వివరాలను పీపుల్స్ హజ్ పేరిట ప్రభుత్వం భద్రపరిచింది. ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు సిఎం. ప్రజాసాదికార సర్వే 80 శాతం పూర్తైందన్నారు. మిగిలిన 20 శాతాన్ని మూడు నెలల్లో పూర్తిచేస్తామని ఐటీ అధికారులు సీఏంకు తెలిపారు.
ఆసుపత్రుల్లో వైద్యుల కొరతపై అధికారులను సీఎం నిలదీశారు. వైద్యుల కొరత సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే అవుట్ సోర్సింగ్ పద్దతిలో వైద్యులను రిక్రూట్ చేసుకోవాలని సూచించారు. తన స్వగ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందన్నారు. కిడ్నీ బాధిత ప్రాంతాలైన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications