నాకు తెలియదు, అలా అనుకోలేదు.. ఇంతకుమించి మాట్లాడను: రెక్కీపై బాబు
తన ఢిల్లీ పర్యటనలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న విషయమై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు స్పందించారు. తాను ఎవరికీ చెడు చేయాలని అనుకోలేదన్నారు.
హైదరాబాద్: తన ఢిల్లీ పర్యటనలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న విషయమై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు స్పందించారు. తాను ఎవరికీ చెడు చేయాలని అనుకోలేదన్నారు.
ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రెక్కీ విషయంమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి చంద్రబాబు స్పందించారు. తనకు ఎవరూ శత్రువులు లేరన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి తానేమీ వ్యాఖ్యానించనని చెప్పారు.
కాగా, చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టుగా ఢిల్లీ పోలీసుల నిఘాలో తేలింది. సీఎం కదలికలపై ఓ కన్నేసి ఉంచిన మావోయిస్టులు ఇప్పటికే ఆయన కదలికలపై ఆరుసార్లు రెక్కీ నిర్వహించారని తేలడం విస్మయానికి గురిచేస్తోంది.

చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్బంగా.. ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఇప్పటికే పలుమార్లు ఏపీ భవన్ పరిసరాల్లో మావోయిస్టులు రెక్కీ చేసి వెళ్లినట్టుగా నిఘాలో బయటపడింది.
ముఖ్యంగా మీడియా ముసుగులో చంద్రబాబుపై మావోయిస్టులు దాడికి దిగే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఏపీ భవన్ లో భద్రతా లోపలున్నాయని, ఈ విషయంపై ఎన్నిసార్లు అక్కడి అధికారులను హెచ్చరించినా లాభం లేకపోయిందని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే రెక్కీలో ఎంతమంది పాల్గొన్నారన్న దానిపై విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఏపీ భవన్ అధికారులకు ఇదే తమ చివరి హెచ్చరిక అని.. ఇకనైనా సీఎం భద్రత విషయంలో పకడ్బందీగా ఉండాలని ఢిల్లీ పోలీసులు తెగేసి చెప్పినట్టు సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications