వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గురించి మాట్లాడటం కంటే: బాబు, ప్యాకేజీపై షాకింగ్, పవన్ కళ్యాణ్-జగన్‌లకు ఝలక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం కన్నా సమస్యల గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని ఏపీ సీఎం,

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం కన్నా సమస్యల గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

'మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు' 'బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే ''మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు' 'బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే '

జగన్ గురించి పెద్దగా మాట్లాడవద్దు

జగన్ గురించి పెద్దగా మాట్లాడవద్దు

పార్టీ నేతల భేటీలో చంద్రబాబు మాట్లాడారు. అప్రధానమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడవద్దని నేతలకు సూచించారు. ఎమ్మెల్యేల్లో సీరియస్‌నెస్ ఉండాలని, సీరియస్ విషయాలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలన్నారు. జగన్ వంటి వారి గురించి పెద్దగా మాట్లాడవద్దని సూచించారు.

జగన్ గురించి మాట్లాడటం కంటే

జగన్ గురించి మాట్లాడటం కంటే

జగన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని చంద్రబాబు సూచించారు. కోర్టుల వద్ద జగన్ వాదన వీగిపోతోందన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ వద్ద వాళ్ల వాదన వీగిపోయిందని గుర్తు చేశారు. కాబట్టి జగన్ గురించి మాట్లాడటం కంటే సమస్యలపై మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని చెప్పారు.

అసెంబ్లీలో ప్యాకేజీ గురించి

అసెంబ్లీలో ప్యాకేజీ గురించి

చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. కొత్తగా ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పిందని, అందుకే ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు. విభజన హామీల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు.

ప్యాకేజీ లెక్క తేలలేదని ఆసక్తికర వ్యాఖ్యలు

ప్యాకేజీ లెక్క తేలలేదని ఆసక్తికర వ్యాఖ్యలు

ప్యాకేజీ ఇంకా ఫైనల్ కాలేదని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఎంత ఇస్తుందనే విషయమై స్పష్టత రాలేదని తెలిపారు. సమస్యలు చాలా ఉన్నాయని, నిధులు చాలా అవసరమని వెల్లడించారు.

హోదాపై పోరాడాలంటే ఢిల్లీ వెళ్లండి

హోదాపై పోరాడాలంటే ఢిల్లీ వెళ్లండి


అంతేకాదు, ప్రత్యేక హోదా కోసం ఏపీలో పోరాటం చేసే వాళ్లపై కూడా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేసేవాళ్లు ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని హితవు పలికారు. ఇలాంటి ఆందోళనలతో ప్రజల్లో అభద్రతా భావం కనిపిస్తోందని చెప్పారు. విభజన హామీలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు.

బాబు వ్యాఖ్యలు పవన్, జగన్, శివాజీలకు తగులుతాయా?

బాబు వ్యాఖ్యలు పవన్, జగన్, శివాజీలకు తగులుతాయా?

కాగా, ప్రత్యేక హోదాపై చంద్రబాబు వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హోదా కోసం పోరాడుతున్న నటుడు శివాజీకి కూడా ఇవి వర్తిస్తాయని చెప్పవచ్చు. వీరంతా హోదా కోసం ఏపీలో మాట్లాడుతున్నారు. ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని బాబు సూచించడం గమనార్హం.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu responded on Special Status and YSR Congress Party chief YS Jaganmohan Reddy on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X