సీమాంద్రలో బాబు రెండో దఫా ఆత్మ గౌరవయాత్ర
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండవ దశ తెలుగువారి ఆత్మ గౌరవ యాత్రను చేపట్టనున్నారు. నవంబర్ ఐదో తేదీ నుంచి మళ్లీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి ఆయన కార్యక్రమం రూపొందించుకొంటున్నారు. దీపావళి తర్వాత పర్యటన మొదలుపెట్టి వీలైనన్ని జిల్లాలు పర్యటించేలా ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో ఆయన పది రోజులపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించారు. ఆ తర్వాత మరికొన్ని జిల్లాల్లో పర్యటించాలనుకున్నారు. కానీ వివిధ రాజకీయ పరిణామాల కారణంగా వాయిదా పడింది. ఈ మధ్యలో ఆయన ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు.

తన పర్యటన మొదలు పెట్టేలోపు అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు పెట్టి పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలని, తన యాత్రకు సమాంతరంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతల పర్యటనలు ఉండేలా చూడాలని ఆయన భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవ యాత్రను చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ కుట్ర చేసిందని, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితోనూ సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతోనూ కుమ్మక్కయ్యిందని చెప్పడానికి ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications