సింధు, గోపీచంద్లకు ఎంతిద్దాం: కేసీఆర్తో చంద్రబాబు పోటీపడతారా?
అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయం, కృష్ణా పుష్కరాల నిర్వహణ తీరుపై చర్చిస్తున్నారు. త్వరలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై కూడా చర్చిస్తున్నారు.
దీంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో పలు పరిశ్రమలకు భూకేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన సింధు, కోచ్ గోపీచంద్ను అభినిందిస్తూ కేబినెట్ తీర్మానం చేయనుంది. దీనికి తోడు సింధుతో పాటు గోపీచంద్కు ఇవ్వాల్సిన నజరానాలపై కూడా కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. కోటిని బహుమానంగా ఇవ్వనుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు రూ. కోటి పారితోషకం ఇస్తామని టీ ప్రభుత్వం తన క్రీడా విధానంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మేరకు నజరానా ప్రకటిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మాదిరే కొటి ఇస్తారా లేక అంతకంటే ఎక్కువ నగదు రివార్డుని ప్రకటిస్తారా? అనే విషయం కేబినెట్ సమావేశం ముగిస్తే కానీ తెలియదు. మంత్రులతో చర్చించి చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి రజత పతకం సాధించిన పీవీ సింధుకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 2 కోట్లు నజరానా ప్రకటించింది. అదే విధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. అరకోటిని నజరానాగా ప్రకటించింది. ఇక బీఏఐ సింధుకు రూ.50 లక్షలు, గోపీచంద్కు రూ.10 లక్షల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications