విభేదాలపై బాబు ఆందోళన: భూమా-శిల్పాల సయోధ్యకు అచ్చెన్నాయుడు
కర్నూలు జిల్లాకు చెందిన పాత, కొత్త టిడిపి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోసారి టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన పాత, కొత్త టిడిపి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోసారి టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాత, కొత్త తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు తలనొప్పిగా మారిన నేపథ్యంలో పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దాలన్న ఉద్దేశంలో చంద్రబాబునాయుడు ఉన్నట్టు తెలుస్తోంది.
జిల్లాలో మొదటి నుంచి టీడీపీలో ఉన్న శిల్పా సోదరులకు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి.. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి బహిరంగ రహస్యమే.
ఇప్పటికే పలు జడ్పీ సమావేశాల నుంచి, అభివృద్ధి కార్యక్రమాల వరకూ వీరి మధ్య ప్రొటోకాల్ గొడవలు, కార్యకర్తల స్థాయిలో ఆగ్రహావేశాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతుండగా, ఈ గొడవలు పార్టీకి నష్టం కలిగిస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పార్టీని చక్కదిద్దే బాధ్యతలను మంత్రి అచ్చెన్నాయుడికి ఆయన అప్పగించారు. దీంతో ఈ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.

ఇదిలావుండగా, అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు బాబు ఓ కమిటీని వేశారు. ఈ కమిటీలో మంత్రులు శిద్ధా రాఘవరావు, నారాయణ, ఎమ్మెల్సీ షరీఫ్ లు ఉన్నారు. మొత్తం గొడవ రహదారుల విస్తరణ కారణంగా వస్తోందని గమనించిన చంద్రబాబు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఉత్తరాంధ్రలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు మధ్య కూడా పలు విషయాల్లో విభేదాలు నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాలు నిత్యమూ గొడవలు పడుతూనే ఉన్నాయి. ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులను సాధ్యమైనంత త్వరలో సరైన మార్గంలో పెట్టుకుంటే, త్వరలో జరిగే కార్పొరేషన్, ఆపై వరుసగా వచ్చే ఎన్నికల్లో విజయావకాశాల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications