వైసిపి వంటి వారు కోర్టుకు, కేంద్రంతో మాట్లాడ్తా: చంద్రబాబుకు కోపమొచ్చింది
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వారంలో 36 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి తవ్వకం జరిగిందని తెలుసుకున్న సీఎం.. పనులు జరుగుతున్న తీరుపై నిలదీశారు.
రోజుకు 2.6లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వకం జరగాల్సి ఉండగా వారానికి కేవలం వేలల్లోనే పని జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే మీ కంపెనీ సీఎండీ, జల వనరులశాఖ కార్యదర్శి పోలవరంలోనే ఉండి పనులు చేయించాల్సి వస్తుందన్నారు.

వర్షాల వల్ల పనులు చేయలేకపోయామని, నీళ్లు తొలగిస్తున్నా మళ్లీ వర్షాలతో చేరుతున్నాయని త్రివేణి సంస్థ ఈడీ కార్తికేయన్ తెలిపారు. వర్షాలు ఆగిన తర్వాత రోజుకు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం జరిగేలా చూస్తామని, ఆ స్థాయిలో యంత్ర సామగ్రిని సమీకరించామన్నారు.
కాగా పోలవరం పనులు వేగం పెంచేందుకు డిజైన్ల ఆమోదానికి సంబంధించి ఏదైనా అవసరమైతే కేంద్రంతోను మాట్లాడతామని చంద్రబాబు చెప్పారు.
ఏ చిన్న లోపం వచ్చినా వైసిపి వంటి ప్రతిపక్షాలు పోలవరం అడ్డుకునేందుకు న్యాయస్థానాలకు వెళ్తున్నాయని, న్యాయస్థానాల్లో వాదించే న్యాయవాదులను కూడా ప్రతి నాలుగో సోమవారం సమావేశానికి పిలుద్దామన్నారు. పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ఏర్పాటు చేయాలన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications