వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందుల ప్రకంపనలు: అత్యాచారం..హత్య కిరాతకం: వైసీపీ ప్రమేయం: డీజీపీకి చంద్రబాబు లేఖ

|
Google Oneindia TeluguNews

అమరావతి: కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకున్న దళిత మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ కరవైందని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు.

అమెరికన్లకు గుడ్‌న్యూస్: ఫైజర్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్: ఓటింగ్: నిపుణులు ఓకే: వారంలోఅమెరికన్లకు గుడ్‌న్యూస్: ఫైజర్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్: ఓటింగ్: నిపుణులు ఓకే: వారంలో

ప్రభుత్వ వైఫల్యం వల్లే..

ప్రభుత్వ వైఫల్యం వల్లే..

శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందడానికి పులివెందుల హత్యోదంతం ఓ నిదర్శనమని పేర్కొన్నారు. ఈ హత్యోదంతం చోటు చేసుకున్నది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కావడం వల్ల నిందితులను కాపాడటానికి స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

అమాయకులను ఇరికించే ప్రయత్నం..

అమాయకులను ఇరికించే ప్రయత్నం..

ఈ తరహా ఘటనలు ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నాయని, నాగమ్మ కేసులో నిందితులపై కఠిన చట్టాలను ప్రయోగంచాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పారు. అసలు నిందితులను కాపాడే ప్రయత్నంలో అమాయకులను ఈ కేసులో ఇరికిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నాగమ్మ హత్యోదంతంతో ఏ మాత్రం సంబంధం లేని వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు కనిపిస్తోందని అన్నారు. దీనివల్ల- మరిన్ని అత్యాచారాలకు పాల్పడటానికి అసలు నిందితులకు అవకాశం కల్పించినట్టవుతుందని హెచ్చరించారు.

అధికార పార్టీ అండదండలు..

అధికార పార్టీ అండదండలు..

రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటలన్నింట్లోనూ నిందితులకు అధికార పార్టీ అండదండలు లభిస్తున్నాయని ఆరోపించారు. దళిత, గిరిజన, మైనారిటీ మహిళలే లక్ష్యంగా దండగులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు తమ అండగా ఉన్నారనే ధైర్యంతోనే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయని, అందుకే దారుణ సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

Recommended Video

Eluru Mystery Disease Named As Jagrono-20 by WHO ఏలూరు అంతుచిక్కని వ్యాధి పేరు 'జగ్రోనో-20'
 మానవ హక్కుల దినోత్సవం రోజైనా..

మానవ హక్కుల దినోత్సవం రోజైనా..

మానవ హక్కుల దినోత్సవం నాడైనా మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు కోరారు. నాగమ్మ హత్యోదంతంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందనే విషయం స్పష్టమౌతోందని, అయినప్పటికీ.. వారిపై కేసులను నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడుతున్నారని అన్నారు. వారి ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకోలేకపోతే.. ఇలాంటి హత్యలు మరిన్ని చోటు చేసుకోవడానికి పరోక్షంగా అవకాశం కల్పించినట్టవుతుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చట్టాలు రూపొందించాలని,. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

English summary
TDP President, former Chief Minister Chandrababu Naidu condemned the rape and murder of a Dalit woman in Pulivendula in Kadapa district. He urged the DGP to take stringent action against the culprits responsible for the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X